హైదరాబాదుకు కర్నాటక రాజకీయాలు?

పార్టీ అధిష్టానం ఒత్తిడి తెస్తున్నప్పుటికీ దిగి రావడానికి గాలి సోదరులు నిరాకరిస్తున్నారు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో హైదరాబాదులో క్యాంపు ఏర్పాటు చేసేందుకు గాలి సోదరులు సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. గాలి సోదరులు ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరినట్లు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా శాసనసభ్యులు తమ నుంచి జారిపోకుండా హైదరాబాదులో క్యాంపు నిర్వహించాలని గాలి సోదరులు భావించినట్లు చెబుతున్నారు. గాలి సోదరులకు అండగా ఉన్న 18 మంది శాసనసభ్యులను హైదరాబాదు శివారులోని ఓ రిస్టార్ లో ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
కాగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయమే బెంగుళూర్ బయలుదేరి వెళ్లారు. ఆయన బెంగుళూర్ వెళ్లడంలో మతలబేమైనా ఉందనే విషయంపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే జగన్ ప్రధాన కేంద్రం చాలా కాలంగా బెంగుళూరే కావడం వల్ల అందులో ప్రత్యేకతేమీ లేదని అంటున్నారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications