హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ఎమ్మెల్యే ఎర్నేనికి మూడేళ్ల జైలు శిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు, మాజీ శానససభ్యుడు ఎర్నేని రాజా రామచందర్ కు హైదరాబాదులోని నాంపల్లి సిఐడి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నకిలీ వైద్య బిల్లుల కేసులో నేరాలు రుజువు కావడంతో కోర్టు ఆయనకు మూడేళ్ల కారాగార శిక్ష విధిస్తూ సిఐడి ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. శాసనభ్యుడిగా ఉన్నప్పుడు 2002 ప్రాంతంలో తనకు మెడిసిటీలో శస్త్ర చికిత్స చేసుకున్నట్లు నకిలీ బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారని కృష్ణమోహన్ తదితరులు హైకోర్టు 2005లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తును హైకోర్టు సిఐడి కోర్టుకు బదిలీ చేసింది. సిఐడి అధికారులు దర్యాప్తు చేసి ప్రత్యేక కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది.

అంతకు ముందు నకిలీ బిల్లుల వ్యవహారంపై ఎర్నేని మీద కృష్ణమోహన్ తదితరులు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అప్పటి శాసనసభ స్పీకరుకు, డిజిపికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ బిల్లులు పొరపాటున వచ్చాయని రాజా రామచందర్ తరఫున రెండు ప్రభుత్వ జీవోలు కూడా జారీ అయ్యాయి. రాజా రామచందర్ దాఖలు చేసిన ఆ జీవోలను కోర్టు తిరస్కరించింది. అభియోగాలు రుజువు కావడంతో రాజా రామచందర్ కు కోర్టు మూడేళ్ల కారాగార శిక్ష విధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X