బాబు రాష్ట్రం ముక్కలకి తలొగ్గారు: జెపి

Jayaprakash Narayan
హైదరాబాద్: కొన్ని ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ రాష్టాన్ని ముక్కలు చేయడానికి అంగీకరించిందని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. సహకార వ్యవసాయంపై గానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై గానీ తాము చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, తమ పోరాటం కారణంగానే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశం అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దొందూ దొందేనని, తమకు అవకాశం రాలేదనే గాని మిగతా విషయాల్లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెసుతో తేడా లేదని ఆయన అన్నారు. తాము కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్నామనే మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. తాము వ్యక్తిగత దూషణలకు దిగడం లేదని, బండ బూతులు తిట్టడం లేదని, వ్యక్తులపై ఆరోపణలు చేయడం లేదని, తాము చర్చను ఒక స్థాయిలో చేస్తున్నామని ఆయన అన్నారు. అవినీతిలో కాంగ్రెసు, తెలుగుదేశం రెండూ ఒక్కటేనని ఆయన అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే తెలుగుదేశం పార్టీ కలర్ టీవీలు, నగదు బదిలీ పథకం వంటివాటిని ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయినా ఫరవా లేదనే దృష్టితో వ్యవహరించిందని ఆయన అన్నారు. సమాజం ముక్కలైనా ఫరవాలేదు, దేశం ముక్కలైనా ఫరవా లేదు గానీ ఆ పార్టీలకు ఓట్లే కావాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయం మారకూడదు, సమాజం మారకూడదనే పద్ధతిలో ఇతర రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. అవినీతిపై జరుపుతున్న పోరాటానికి తెలుగుదేశం ఎందుకు కలిసి రావడం లేదని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+