హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ను గాలి కలవరు: బాలినేని

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కలవబోరని రాష్ట్ర గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం వైయస్ జగన్ తో భేటీ అయ్యారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై తాను రేపు మాట్లాడతానని ఆయన చెప్పారు. పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్ ను శుక్రవారం మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెసు నాయకులు కలిశారు.

జగన్ ను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెసు నాయకులు కొంత మంది జగన్ ను కోరుతున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఇంత వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల కలిగిన విషాదం నుంచి కోలుకోలేదని, అందువల్ల జగన్ ప్రచారంలో పాల్గొంటారో లేదో చెప్పలేమని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X