హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐకి ఓబుళాపురం: చిరు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓబుళాపురం గనుల వ్యవహారంపై దర్యాప్తునకు సిబిఐకి అప్పగించాలని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరారు. గనులను జాతీయం చేయాలని కూడా ఆయన కోరారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. తన సూచనలపై ఆలోచన చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని, రోశయ్య హామీలో నిజాయితీ కనిపించిందని ఆయన భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అది సంతృప్తికరంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వ శాఖలతో దర్యాప్తు చేయిస్తామని రోశయ్య చెప్పినట్లు ఆయన తెలిపారు. అప్పుడు కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే తాము ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు.

ఓబుళాపురం గనుల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి తాము వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఉమ్మడి అంశాలుంటే అటువంటి సమావేశాలకు వెళ్తామని ఆయన చెప్పారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై కొన్నేళ్లుగా ప్రతిపక్షాలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఓబుళాపురం ఖనిజాలను సొంత పరిశ్రమలకు వాడుకోవడానికి మాత్రమే అనుమతి ఉందని, అయితే వాటిని ఎగుమతి చేస్తూ నిబంధనలకు ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. గనుల లీజు రద్దు చేసి ప్రభుత్వమే గనుల తవ్వకాలను చేపట్టాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X