ఆస్పత్రిలో మహిళ మృతిపై ఆందోళన

క్రమంగా కోలుకుంటున్న రమాదేవి, మంగళవారం తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్యులు ఐసీయూలో ఉంచి వైద్యం అందించడం ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.తన తల్లి రమాదేవి(45) మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె కుమార్తె వరలక్ష్మి ఆరోపించింది. దీం తో మృతురాలి బంధువులందరూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకు న్న సూర్యారావుపేట పోలీసులు ఆస్ప త్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బంధువుల ఆందోళన చివరకు పోలీస్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్ళింది.












Click it and Unblock the Notifications