వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెషావర్ లో పేలుడు: 6గురు మృతి
పోలీసు స్టేషను సమీపంలోకి ఒక వాహనం వచ్చిందని, అది పేలిపోయిందని, దాంతో భారీ నష్టం వాటిల్లిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ భవనం, మసీదు, బాలుర పాఠశాల ధ్వంసమయ్యాయి. ఇది ఆత్మాహుతి దాడియా, కాదా అని తెలియడం లేదని పోలీసు అధికారి మొహమ్మద్ కరీం ఖాన్ అన్నారు. రద్దీగా ఉండే బుధ్ బేర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని అస్పత్రులకు తరలిస్తున్నారు.
Comments
Story first published: Monday, November 16, 2009, 9:48 [IST]