వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్ లో పేలుడు: 6గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Peshawar
పెషావర్: పాకిస్తాన్ లో పెషావర్ మిలిటెంట్ల దాడులతో అట్టుడుకుతూనే ఉన్నది. పెషావర్ లోని పోలీసు స్టేషన్ సమీపంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. వారంలో పెషావర్ లో ఇది ఐదో పేలుడు సంఘటన. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, 20 మంది దాకా గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

పోలీసు స్టేషను సమీపంలోకి ఒక వాహనం వచ్చిందని, అది పేలిపోయిందని, దాంతో భారీ నష్టం వాటిల్లిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ భవనం, మసీదు, బాలుర పాఠశాల ధ్వంసమయ్యాయి. ఇది ఆత్మాహుతి దాడియా, కాదా అని తెలియడం లేదని పోలీసు అధికారి మొహమ్మద్ కరీం ఖాన్ అన్నారు. రద్దీగా ఉండే బుధ్ బేర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని అస్పత్రులకు తరలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X