హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు: రోశయ్య నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తును కోరాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని అఖిల పక్షాలు కూడా తీవ్ర ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఓబుళాపురం అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. సిపిఐ, సిపిఎం, లోకసత్తా తెలుగుదేశం పార్టీతో కలిసి ఆందోళనకు దిగాయి.

ఓబుళాపురం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. వి. హనుమంతరావు వంటి కాంగ్రెసు నేతలు కూడా సిబిఐ దర్యాప్తునకు సుముఖంగా ఉన్నారు. సిబిఐ దర్యాప్తు జరిపిస్తే సరిపోతుందని వి. హనుమంతరావు ఇంతకు ముందు అన్నారు. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయించి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను అడ్డుకోవాలని హనుమంతరావు మంగళవారం కూడా కోరారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడివారు ఎంతటివారైనా ఉపేక్షించకూడదని, వారిని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X