వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరా గాంధీ పాత్రలో మాధురీ దీక్షిత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhuri Dixit
వాషింగ్టన్: మదర్, ది ఇందిరా గాంధీ స్టోరీ అనే కొత్త చలన చిత్రంలో మాధురీ దీక్షిత్ ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. కృష్ణ షా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారు. తొలి భాగం 2011 చివరినాటికి విడుదలవుతుంది. రెండో భాగానికి మరో ఏడెనిమిది నెలలు పడుతుంది. ఈ చిత్రాన్ని బహు భాషల్లో నిర్మిస్తున్నట్లు కష్ణ షా చెప్పారు.

మదర్ చిత్రాన్ని ఆయన హింగ్లీస్ చిత్రంగా అభివర్ణించారు. ఇది అత్యంత ఉత్కంఠభరితమైన, నాటకీయమైన కథ అని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ జీవితాన్ని ఒక చిత్రంలో బంధించలేదని, ఆమె జీవిత చట్రం అంత పెద్దదని ఆయన అన్నారు. ఈ చిత్ర నిర్మాణం వచ్చే ఏడాది ఏప్రిల్ లో భారత్ లో ప్రారంభమవుతుంది. షా గత 23 నెలలు ఈ చిత్రం స్క్రిప్టు రాస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బడ్జెట్ పారానార్మల్ కన్నా ఎక్కువగా అవతార్ కన్నా తక్కువగా ఉంటుందని కృష్ణ షా వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X