రోశయ్య పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Rosaiah
విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటిబాలరాజు సూచించారు. గురువారం సాయంత్రం సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ శ్యామలరావు, వుడా వీసీ వి.ఎన్‌.విష్ణు, నగర పోలీసు కమిషనర్‌ ఎన్‌.సాంబశివరావు, జీవీఎంసీ కమిషనర్‌ బి.శ్రీధర్‌ తదితర ఉన్నతాధికారులతో ప్రాధమికంగా చర్చించారు.

అనంతరం ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలు, శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రదేశాలను ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. బీచ్‌రోడ్డు, తెన్నేటి పార్కు, కాపులుప్పాడ, గృహ సముదాయం, ఐటీపార్కులోని సింబోసియాస్‌ టెక్నాలజీస్‌, గిరిజన సదస్సు నిర్వహించే ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌ హాల్‌ను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్‌, భద్రత, సదస్సుకు హాజరయ్యేవారికి కల్పించాల్సిన వసతి సౌకర్యాలు గురించి చర్చించారు. పర్యటనలో జిల్లా కలెక్టర్‌ శ్యామలరావు, జాయింట్‌ కలెక్టర్‌ పి.సత్యనారాయణరెడ్డి, యూఎల్‌సీ ఎస్‌డీసీ ఎస్‌.సత్యనారాయణ, ఆర్‌డీఓ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+