వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరాచీలో తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mullah Omar
వాషింగ్టన్: తాలిబాన్ నేత ముల్లా ఒమర్ పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్నట్లు వాషింగ్టన్ టైమ్స్ పత్రిక శుక్రవారం రాసింది. అమెరికా ద్రోణ్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒమర్ ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ క్వెట్టా నుంచి కరాచీకి రహస్యంగా తరలించినట్లు ఆ పత్రిక తెలిపిది. అమెరికా దాడుల సమయంలో ఒమర్ ఒసామా బిన్ లాడెన్ తో పాటు ఆల్ ఖైదా నాయకులకు ఆశ్రయం కల్పించి వారిని రక్షించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అఫ్గనిస్తాన్ ను అమెరికా దాడుల ద్వారా 2001లో స్వాధీనం చేసుకున్నప్పుడు ఒమరో తన శురా లేదా మండలిని కాందహార్ నుంచి తరలించాడు.

రంజాన్ మాసం తర్వాత ముల్లా ఒమర్ కరాచీకి వెళ్లినట్లు ఇద్దరు అమెరికా నిఘా అధికారులు, ఓ సిఐఎ మాజీ అధికారి వాషింగ్టన్ టైమ్స్ తో చెప్పారు. అమెరికా దాడులు లేకపోవడంతో ఒమర్ తన మండలిని పునరుద్ధరించినట్లు ఆ పత్రిక రాసింది. ఒమర్ ఇటీవల కరాచీలో కనిపించినట్లు సిఐఎ ప్రముఖుడు బ్రూస్ రీడెల్ చెప్పారు. కరాచీలో చాలా మద్రాసాలున్నాయి. దాంతో తలదాచుకోవడానికి ఒమర్ కు సులభమవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X