కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ గ్రేటర్ ప్రచారం మొదలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెసు అభ్యర్థుల తరఫున శుక్రవారం ప్రచారానికి కదిలారు. ఆయన తొలుత తన తల్లి విజయలక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాదులోని సోమాజిగూడాలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబూ జగజీవన్ రామ్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ ఇందిరా గాంధీ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు.

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే బంగారు మైసమ్మను దర్శించుకుని మహేశ్వరం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించడానికి బయలుదేరారు. చెల్లెమ్మ, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గం నుంచి ప్రతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి సంప్రదాయంగా చేసుకున్నారు. అలాగే జగన్ కూడా తన ప్రచారాన్ని సబితా ఇంద్రారెడ్డి నియోజక వర్గంలోని మహేశ్వరం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన శుక్రవారం గ్రేటర్ హైదరాబాదులో సుడిగాలి పర్యటన చేస్తారు. ఆయన వెంట గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు నాయకుడు దానం నాగేందర్ తదితర నాయకులున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X