వ్యతిరేకుల సీట్లపై వైయస్ జగన్ శీతకన్ను

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన అనుయాయుల నియోజక వర్గాల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తలపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాసనసభా నియోజకవర్గాలుండగా 15 నియోజక వర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఈ 15 నియోజకవర్గాలను కూడా ఇటీవలి ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన వర్గం వారికి టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ఆయన పట్టు బట్టి ఈ ప్రచారానికి అనుమతి సంపాదించుకున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కల్పించుకుని జగన్ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు.

తనను వ్యతిరేకిస్తున్న, తనవారు కాదనుకున్న కాంగ్రెసు శాసనసభ్యులున్న నియోజక వర్గాల్లో ఆయన ప్రచారం సాగించడం లేదు. జూబిలీహిల్స్, సనత్ నగర్, కంటోన్మెంట్, పటాన్ చెరు, అంబర్ పేట నియోజకవర్గాల్లో ఆయన తిరగడం లేదు. జూబిలీహిల్స్ కు కాంగ్రెసు శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తండ్రి జనార్దన్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగానే వ్యవహరించారు. సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంటోన్మెంట్ నుంచి శంకర్ రావు, పటాన్ చెరు నుంచి నందీశ్వరగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడా జగన్ కు సన్నిహితులు కారు. అలాగే అంబర్ పేటలో సీనియర్ కాంగ్రెసు నేత వి. హనుమంతరావు తనవారికి టికెట్లు ఇప్పించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+