హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖనిజ సంపదల దోపిడీ: కోడెల

By Santaram
|
Google Oneindia TeluguNews

Kodela Siva Prasada Rao
హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఖనిజ సంపదను పూర్తిగా దోచేస్తున్నారని తెలుగుదేశం సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ రావు ఆరోపించారు. ఓబుళాపురం గనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని సుప్రీం సాధికారిక కమిటీ నిర్ధారించినప్పటికీ ముఖ్యమంత్రి రోశయ్య ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.

విచారణను సీబీఐకి అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం తగదని ఆయన హితవు పలికారు. అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న రహదారులు ఇనుపఖనిజం లారీలతో దెబ్బతినిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మంచిది కాదని కోడెల విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X