విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య విశాఖ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కె.రోశయ్య విశాఖపట్నం పర్యటనను ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు పిలుపునిచ్చారు. ఈనెల 25,26 తేదీల్లో జరిగే సీఎం పర్యటన గురించి ఆదివారం ప్రభుత్వ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులతో మంత్రి చర్చించారు.

ఈ సమావేశంలో పార్లమెంట్‌ సభ్యుడు సబ్బం హరి, శాసన సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్‌, యు.వి.సత్యనారాయణరాజు(కన్నబాబు), జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు తోట నగేష్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు గొర్లె రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గిరిజన సదస్సు, ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహించాలని మంత్రి బాలరాజు గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.కిషోర్‌ను ఆదేశించారు. సదస్సు నిర్వహణపై ఆయనతో మంత్రి చర్చించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X