పాక్ లో ఆర్మీదే అధికారం: మన్మోహన్

Manmohan Singh
వాషింగ్టన్: పాకిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నప్పటికీ సైన్యానిదే అధికారమని, అందువల్ల ఎవరితో వ్యవహరించాలో, ఎవరితో సంప్రదింపులు జరపాలో అర్థం కావడం లేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ లో అత్యంత ముఖ్యమైన శక్తి సైన్యమని అన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా అన్నారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఉందని, ప్రజాస్వామ్యం మరింతగా పరిపుష్టం కావాలని తాను ఆశిస్తున్నానని, వాస్తవానికి సైన్యం చేతిలో అధికారం ఉందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

పర్వేజ్ ముషార్రఫ్ అధికారంలో ఉన్నప్పుడు తాను అడుగుతూ ఉండేవాడినని, తాను సైన్యానికి చెందినవాడిననీ తాను సైన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననీ తాను ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాననీ ముషార్రఫ్ చెబుతుండేవారని, ఇప్పుడు ఎవరితో మాట్లాడాలో తెలియడం లేదని మన్మోహన్ అన్నారు. పాకిస్తాన్ కూలిపోయే స్థితిలో ఉందని, అణ్వాయుధాలు ఒక్కరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి మారుతున్నాయని, సైన్యంలోని లేదా ఉగ్రవాదుల్లోని అతివాదుల చేతుల్లోకి అవి పోతున్నాయని, ఇందుకు సంబంధించి తాము ఆందోళన చెందుతున్నామని ఆయన అన్నారు. అయితే ఆ విధంగా జరగదని తమకు అమెరికా హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+