తిట్టుకుంటూ కూర్చోవడం కాదు: జెపి

ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోస ఓటేయడం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ఇవియంలు సరిగా పనిచేయకపోవడం వల్ల, చలి వల్ల ఉదయం పూట వోటింగ్ మందకొడిగా జరిగినట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. యువత, మధ్యతరగతి చురుగ్గా ఓటేస్తున్నట్లు సమాచారం వస్తోందని ఆయన చెప్పారు. పార్లమెంటు ఎన్నికల కన్నా హైదరాబాద్ ఎన్నికలు ముఖ్యమైనవని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకోవడానికి ఇవి పనికి వస్తాయని ఆయన అన్నారు. ఇది పార్టీల పోరు కాదని, మన జీవితాలను మార్చుకోవడానికి జరుగుతున్న పోరు అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications