వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్పేయిని తప్పు పట్టిన లిబర్హాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Atal Bihari Vajpayee
న్యూఢిల్లీ: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనకు సంబంధించి లిబర్హాన్ కమిషన్ మాజీ ప్రధాని వాజ్ పేయిని తప్పు పట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ను నివేదిక నిందించింది. కూల్చివేతకు కారణమైనవారిపై ఏ విధమైన చర్యలకు కమిషన్ సిఫార్సు చేయలేదు. అయితే రాజకీయ ప్రయోజనాలకు మతాన్ని వాడుకునే వారిపై శిక్షించడానికి కొత్త చట్టం తేవాలని సూచించింది. 1992 డిసెంబర్ 6వ తేదీన కూల్చివేతలో కమీషన్ 68 మందిని తప్పు పట్టింది.

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ వ్యవహరించిన తీరుపై కమిషన్ తీవ్ర విమర్శలు చేసింది. కూల్చివేత జరుగుతుంటే కళ్యాణ్ సింగ్ నియోగించిన అధికారులు, పోలీసు అధికారులు మౌనంగా ఉండిపోయారని దయ్యబట్టింది. కూల్చివేతకు ఉమా భారతి, గోవిందాచార్య, కల్యాణ్ సింగ్, శంకర్ సింఘ్ వాఘేలా బాధ్యులని కమిషన్ తేల్చింది. సీనియర్ బిజెపి నాయకులు వాజ్పేయి, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి కూల్చివేతకు సైద్ధాంతికంగా, బౌద్ధికంగా బాధ్యులని విమర్శించింది. లిబర్హాన్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన వెంటనే బిజెపి సభ్యులు పార్లమెంటు ఉభయసభల్లో కూడా కార్యక్రమాలను స్తంభింపజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X