అవి ' చెత్త ' ఆరోపణలే కావచ్చు: రోశయ్య

విశాఖ కార్పొరేషన్ లోని ఆ ఆరోపణలపై కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ఇప్పటికే రాజీ యత్నాలు చేశారు. జీవీఎంసీ 'చెత్త' పంచాయతీ మరోసారి కేంద్రమంత్రి, విశాఖ ఎంపీ పురందేశ్వరి ఎదుట జరగనుంది. ఈ వ్యవహారంపై ఆమె రెండు రోజుల క్రితం రాజధానిలో జిల్లా మంత్రి బాల రాజు, మేయర్, డెప్యూటీ మేయర్లతో భేటీ అయి రాజీ కుదిర్చారు. పార్టీనీ, జీవీఎంసీని కుదిపేస్తున్న చెత్త వివాదాన్ని తమ ప్రమేయం లేకుండా మేయర్, డెప్యూటీలతో ఎలా పరిష్కరిస్తారంటూ కొందరు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. డెప్యూటీ మేయర్ దొరబాబు వర్గానికి చెందిన కార్పొరేటర్లు కంపా హనోకు, జి.వి.కృష్ణారావులు ఏకంగా జీవీఎంసీ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు.
రూ.వెయ్యి కోట్ల కుంభకోణంపై ప్రజలకు వివరణ ఇచ్చేదాకా మేయర్, డెప్యూటీలను జీవీఎంసీకి వెళ్లకుండా అడ్డుకుంటామని, తామూ వెళ్లబోమని ప్రకటించారు. సాక్షాత్తూ దొరబాబు వర్గీయులే ఇలా అడ్డం తిరగడంతో సర్వత్రా కలకలం రేగింది. మరోపక్క తమతో పనిలేకుండా పురందేశ్వరి ఇరువర్గాలకు రాజీ ఎలా కుదురుస్తారన్న అసంతృప్తి నగర ఎమ్మెల్యేల్లో కూడా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగిన కార్పొరేటర్లతో మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పురందేశ్వరి ఫోన్లో మాట్లాడారు. తాను బుధవారం సాయంత్రం విశాఖ వస్తున్నానని, అందరినీ కూర్చోబెట్టి వివాదాన్ని పరిష్కరిస్తానని, అంతవరకూ ఎలాంటి ఆందోళనలు చేపట్టవద్దని కోరారని హనోకు 'న్యూస్లైన్'కు తెలిపారు. చెత్త వివాదం ముఖ్యమంత్రి కె.రోశయ్య దృష్టిలోనూ ఉంది.
ఇప్పటికే మేయర్ పులుసు జనార్దనరావు సీఎంను కలిశారు. జీవీఎంసీలో రూ.వెయ్యి కోట్ల చెత్త కుంభకోణం జరిగిందంటూ కౌన్సిల్లో డెప్యూటీ మేయర్ దొరబాబు ఆరోపణల నేపథ్యంలో నెలకొన్న పరిణామాలను ఆయనకు వివరించారు. సీఎం రెండు రోజుల విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన రాకకు ముందే ఈ వివాదాన్ని చల్లబరచాలని పార్టీ నేతలు భావించారు. అనూహ్యంగా ఆ పంచాయతీ వారి మధ్య కాకుండా కేంద్రమంత్రి పురందేశ్వరి సమక్షంలో జరిగింది. బుధ, గురువారాల్లో ముఖ్యమంత్రి విశాఖలోనే ఉంటారు. మేయర్, డెప్యూటీల విభేదాలపై సీఎం జోక్యం చేసుకుంటారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఇంతలో పురందేశ్వరి బుధవారం కార్పొరేటర్లు, మేయర్, డెప్యూటీలతో సమావేశమవుతారన్న విషయం బయటికొచ్చింది. సీఎం నగరంలో బస చేస్తున్నందువల్ల బుధవారం రాత్రి వీరితో పంచాయతీ ఉంటుందా? గురువారానికి వాయిదా పడుతుందా? అన్న సందేహాలున్నాయి. చెత్త వివాదం వల్ల పార్టీ పరువు బజారున పడటంతో ఇప్పటికైనా దీనిని పరిష్కరించి, పార్టీకి మరింత నష్టం వాటిల్లకుండా చూడాలని సిసలైన కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications