వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ పొత్తుపై ఇప్పటికైతే లేదు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదులో అధికారాన్ని పంచుకోవడానికి మజ్లీస్ తో దోస్తీ కట్టే ఆలోచన ఇప్పటికైతే లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటి వరకు అటువంటి ఆలోచన ఏదీ చేయలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పొత్తుపై ఆలోచన చేయడం లేదని అన్నారు. మజ్లీస్ తో పొత్తుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు. ఫలితాలపై పార్టీలో తాము సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని, సమీక్ష చేసుకున్న తర్వాతనే ఏదైనా చెప్పగలనని ఆయన అన్నారు. తాను ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై పోరాటంలో భాగంగా ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోని కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు మంచి ఆదరణ ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

శాసనసభ ఎన్నికల్లో కూడా తాము ఒక్క శాతం ఓటుతోనే ఓడిపోయామని ఆయన చెప్పారు. పొత్తుల వల్ల, చిన్నచితకా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల ఆ ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన అన్నారు. కాంగ్రెసుకు తెలుగుదేశం పార్టీయే ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించారని చెప్పడానికి గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు నిదర్శమని ఆయన అన్నారు. తమ పార్టీకి అనూహ్యమైన ఫలితాలు సాధించి పెట్టిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X