ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వాస్పత్రికి కెసిఆర్ తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సోమవారం సాయంత్రం ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖమ్మం సబ్ జైలు నుంచి ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రి నుంచి కెసిఆర్ ను పరీక్షించేందుకు వైద్యుల బృందం ఇక్కడికి చేరుకుంది. కెసిఆర్ ఆ వైద్యులు పరీక్షించారు. పరీక్షల నిమిత్తం కెసిఆర్ ను ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే, కెసిఆర్ ఎవరికీ కనిపించకుండా అద్దాలు అమర్చిన వాహనంలో జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు.

కాగా, కెసిఆర్ ను చూడడానికి సిద్ధిపేట నుంచి ఖమ్మం బయలుదేరిన తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, రవీంద్రారెడ్డిలను పోలీసులు తిరుమలాయపాలెం వద్ద అడ్డుకున్నారు. కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు వరంగల్ సెంట్రల్ జైలు నుంచి సోమవారం సాయంత్రం విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన తెలంగాణ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. తనను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. జాతి పోరాటం చేస్తున్నట్లు తనపై ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. అనంతరం ఆయన తన తండ్రి కెసిఆర్ కు అండగా ఉండడానికి ఖమ్మం బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X