ఖమ్మం జైల్లోనే కెసిఆర్: సబిత స్పష్టం

కెసిఆర్ కు చికిత్స అందించడానికి ఖమ్మంలో సరైన సౌకర్యాలు ఉన్నాయా, లేవా అనే విషయాన్ని కూడా వైద్యుల బృందం నివేదిక సమర్పిస్తుందని, ఆ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. వైద్యుల నివేదిక అందిన తర్వాత ఏం చేయాలనేది చూస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఆందోళనలో అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే తాము కెసిఆర్ నిరాహార దీక్ష చేపట్టవద్దని, బంద్ పాటించకూడదని తాము తెరాసను కోరినట్లు ఆమె తెలిపారు. చిన్న పాటి సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగానే జరిగిందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications