హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ దీక్ష: కమిషన్ కు కవిత ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ దీక్ష విరమించారంటూ వచ్చిన వార్తలపై ఆయన కూతురు, తెలంగాణ జాగృతి ప్రతినిధి కల్వకుంట్ల కవిత మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కెసిఆర్ ను అక్రమంగా నిర్బంధించి, బలవంతంగా దీక్షను విరమింపజేశారని ఆమె ఆరోపించారు. దీనిపై మానవ హక్కుల కమిషనర్ జస్టిస్ సుభాషన్ రెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి, ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ కు నోటీసులు జారీ చేశారు. దీనిపై 24 గంటల లోగా వివరణ ఇవ్వాలని ఆమె ఆదేశించారు.

తెరాస నాయకత్వాన్ని మలినం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని కవిత మీడియా ప్రతినిధులతో అన్నారు. దీక్ష విరమిస్తున్నట్లు చూపే దృశ్యాన్ని మాత్రమే ప్రభుత్వం మీడియాకు విడుదల చేసిందని, మిగతా దృశ్యాలను విడుదల చేయకపోవడం కుట్ర అని ఆమె అన్నారు. తాను దీక్ష విరమించదలుకుంటే కెసిఆర్ ముందుగా మీడియాకు చెప్పి ఉండేవారని ఆమె అన్నారు. కెసిఆర్ నిబద్ధతతో వ్యవహరిస్తారని, అటువంటి వ్యక్తి అలా చేస్తారని అనుకోవడం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X