హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొట్టి శ్రీరాములు, రాజీవ్ విగ్రహాలు ధ్వంసం

By Santaram
|
Google Oneindia TeluguNews

Potti Sriramulu
హైదరాబాద్‌: విశాల ఆంధ్రప్రదేశ్ ను సాధించిన పొట్టి శ్రీరాములు విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని బొల్లేరుగూడెం, ఖమ్మం పీఎస్‌ఆర్‌ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహాలను దుండగులు పగులగొట్టారు. కాగా కరీంనగర్‌ జిల్లా ఓదెలలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, జగద్గిరిగుట్టలో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పీ జనార్థన్‌రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనలకు దిగారు.

మద్రాసు రాష్ట్రం నుంచి విడదీసి తెలుగు వారందరికీ కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేసిన అసువులు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు కారణంగానే తాము ఆంధ్రులతో కలిసి ఇష్టం లేకపోయినా సహజీవనం సాగించవలసి వస్తోందని తెలంగాణ వాదుల అభిప్రాయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X