హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి: జెఇసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులందరూ ఈ సాయంత్రంలోగా రాజీనామాలు చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఇసి) నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెలుదేశం, ప్రజారాజ్యం పార్టీల తెలంగాణ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకపోతే శాసనసభ్యులను, మంత్రులను తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ రాజకీయ పార్టీల తెలంగాణ నాయకులంతా ముందుకు రావాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్ష విరమించినా తమకు అభ్యంతరం లేదని వారు చెప్పారు. కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని వారు శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కెసిఆర్ కు ఏమైనా జరిగితే తెలంగాణ అగ్ని గుండంగా మారుతుందని వారు హెచ్చరించారు. కెసిఆర్ ను తాము కాపాడుకుంటామని వారు చెప్పారు. తెలంగాణపై తాము ఈ నెల 10వ తేదీన శాసనసభను ముట్టడిస్తామని వారు చెప్పారు. పదవ తేదీలోగా తెలంగాణ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు విద్యార్థులు శనివారం కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X