వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పులివెందులఎమ్మెల్యేగా విజయలక్ష్మి కొంతకాలమే'

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Vijayalakshmi
కడప: పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా వైఎస్ విజయమ్మ కొద్ది కాలమే కొనసాగుతారని కడప మేయర్‌, వైఎస్ బావమరిది పి.రవీంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోండి. నెలకో, ఆరు నెలలకో, సంవత్సరానికో పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ పోటీ చేయడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రవీంద్రనాథ్‌ రెడ్డి శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజా ప్రతినిధులు, ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్‌ కుటుంబంలో ఒక వ్యక్తికి ఓ పదవి కట్టబెట్టినంత మాత్రాన రాష్ట్రానికి మేలు చేసినట్లు కాదని, ప్రజలను మోసం చేసినట్లేనని పరోక్షంగా పార్టీ పెద్దలనుద్దేశించి రవీంద్రనాథ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

వైఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పనులను కొనసాగించే విషయంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని అన్నారు. అందుకు తెలంగాణలో జరుగుతున్న సంఘటనలే నిదర్శనమన్నారు. వైఎస్‌ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన విపక్షాలకు రవీంద్రనాథ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X