హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చుక్కా రామయ్య బైఠాయింపు: ఒయులో ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Chukka Ramaiah
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అడుగు పెట్టారు. ఆయనను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దాంతో ఆయన ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సరస్వతీ ఆలయం వద్ద బైఠాయింపు జరిపారు. ఆయన ఒక్కరే విశ్వవిద్యాలయానికి నడిచి వచ్చారు. తాను నిషేధాజ్ఞలను ఉల్లంఘించలేదని, అందువల్ల తనను అనుమతించాలని ఆయన పట్టుబట్టారు. ఆయన పట్టుబట్టి బైఠాయింపు జరిపి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తనకు ప్రాణం పోసిందని అంటూ ఆయన కంట తడి పెట్టారు. అయితే పోలీసులు ఆయనను అరెస్టు చేసి తీసికెళ్లారు.

బుధవారం ఉదయం నుంచే పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసే పనికి పూనుకున్నారు. హాస్టళ్లలోకి ప్రవేశించి లాఠీచార్జీ చేస్తూ విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. రాత్రే హాస్టళ్లకు నీటిని, కరెంట్ ను కట్ చేశారు. అయినా విద్యార్థులు ఇంకా విశ్వవిద్యాలయంలో ఉన్నారు. వారు దీక్షలు సాగిస్తూ ఉన్నారు. పోలీసులు టెంట్లను పీకేసి విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థులు ఆర్ట్ర్స్ కళాశాల వద్ద అన్నాలు వండుకుని తిన్నారు. పోలీసులు మీడియాపై కూడా దాడి చేశారు. దీనికి నిరసనగా మీడియా ప్రతినిధులు దర్నాకు దిగారు. దీంతో పోలీసాఫీసర్ ఇక్బాల్ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున పోలీసుల పని పోలీసులు చేస్తున్నారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X