ఎవరినీ వదిలి పెట్టం: తెలంగాణపై రోశయ్య

ఆ తర్వాత రోశయ్య చాలా వరకు తగ్గి మాట్లాడారు. తెలంగాణ చాలా సున్నితమైన వ్యవహారమని, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన ఆ తర్వాత అన్నారు. అవకాశం వస్తే తెలంగాణ గురించి సోనియాతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. తెలంగాణకు పరిష్కారం కనుక్కోకపోతే మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందని ఆయన అన్నారు. సమస్యను అందరి దృష్టికి తీసుకు రావడంలో కెసిఆర్ విజయం సాధించారని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి కొంత వ్యవధి కావాలని ఆయన అన్నారు. పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం గుర్తించిందని ఆయన అన్నారు. కెసిఆర్ పట్టుదలకు పోకుండా దీక్ష విరమించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications