వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడ: 25 మంది కార్పొరేటర్ల రాజీనామా

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు నిరసనగా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లోని 25 మంది కార్పొరేటర్లు గురువారం ఉదయం రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తమ రాజీనామాలను ప్రకటించారు. మచిలీపట్నం మునిసిపల్ చైర్మన్ సిలార్ సహా ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు.

విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణకు వచ్చే బస్సులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలు జరుగుతున్నాయి. గుత్తిలో మూడు ఆర్టీసి బస్సులకు నిప్పు పెట్టారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేపు రాయలసీమ బంద్ కు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. ఆంధ్ర బంద్ పిలుపుకు ఆ ప్రాంత శాసనసభ్యులు పిలుపునిచ్చారు. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X