వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆనందపు డోలికల్లో 'వరం ఘల్లు ఘల్లు'

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
వరంగల్: తెలంగాణ పోరాటానికి నడిబొడ్డుగా నిలిచిన వరంగల్ నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారుల చిరకాల స్వప్నం ఫలించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం బుధవారం అర్ధరాత్రి ప్రకటించగానే లక్షలాది ఓరుగల్లు హృదయాలు పులకించిపోయాయి.

ఒక్కసారిగా జనం రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. జై తెలంగాణ అని నినాదాలు హోరెత్తించారు. ఆనందోత్సాహాలతో ఆలింగనాలు చేసుకున్నారు. అభినందనల వెల్లువతో ఫోన్లన్నీ బిజీగా మారిపోయాయి. ఎస్‌ఎంఎస్‌లు పోటెత్తాయి. కేయూలో ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహపూరితంగా మారిపోయింది. విద్యార్థులు కేరింతలు కొడుతూ పోలీసులను హత్తుకున్నారు. తాజా పరిణామాలతో తెలంగాణ ధిక్కార శక్తి మరోసారి ప్రపంచానికి చాటి నట్లయింది.

కేసీ ఆర్‌ ఆమరణ నిరాహారదీక్షకు ప్రజ లకు ఆందోళన దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి చిదం బరం- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని బుధవారం రాత్రి ఈ మేరకు ఒక ప్రకటన చేయడంతో జిల్లా యావత్‌ ఆనందడోలికల్లో ఊగిపోయింది. విద్యార్థులు ఆనందంతో నృత్యాలు చేశారు.

కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు నుంచి పదకొండు రోజుల పాటు జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. వివిధ విద్యార్ధి సంఘాల సంయుక్త కార్యాచరణ సంఘం (జెఎసి) నాయకత్వంలో కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ కేంద్రంగా ఆందోళనలు తీవ్ర స్ధాయిలో సాగాయి. ఆందోళనకు మద్దతుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు ఒక్కరేమిటి అన్ని వర్గాల ప్రజలు, పాఠశాల విద్యార్థులు సైతం ఆందోళనలో పాలుపం చుకున్నారు. జిల్లా యావత్‌ ర్యాలీలతో దద్దరిల్లింది. రాస్తా రోకోలతో స్తంభించి పోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X