వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలు అనంత, మైసురా రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Mysoora Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కాంగ్రెసు అనంతపురం లోకసభ సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తన లోకసభ సభ్యత్వానికి ఆయన గురువారం రాజీనామా చేశారు. ఇప్పటికే విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజీనామా చేశారు. కాగా, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ మైసురా రెడ్డి రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు.

కర్నూలు కాంగ్రెసు లోకసభ సభ్యుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. తాను కూడా రాజీనామా చేస్తానని రాజంపేట కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కాగా, మచిలీపట్నం తెలుగుదేశం లోకసభ సభ్యుడు నారాయణరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు పంపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X