హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్వేగానికి లోనై రాజీనామాలు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఉద్వేగానికి లోనై శాసనసభ్యులు రాజీనామాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. అంతగా ఉద్వేగానికి లోను కావాల్సిన అవసరం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అన్ని పార్టీల శాసనసభ్యులు ఉద్వేగానికి లోనవుతున్నారని ఆయన అన్నారు. శాసనసభలో మెజారిటీ ఉంటేనే తీర్మానం ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రకటనతోనే రాష్ట్రం విడిపోయిందనే భావన చోటు చేసుకుందని, అది సరైంది కాదని ఆయన అన్నారు. అప్పుడే అయిపోయినట్లు భావించి రాజీనామాలు, ఆందోళనలు చేయవద్దని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుందని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అన్నిపార్టీలతో మాట్లాడిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణమవుతుందని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవడం కూడా ప్రక్రియలో భాగమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితిని తమ పార్టీ అధిష్టానం జాగ్రత్తగా పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితిపై చర్చకు సాయంత్రం ఆరు గంటలకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.అన్ని ప్రాంతాలవారితో చర్చించిన తర్వాత తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X