వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలు: సంక్షోభంలో రోశయ్య ప్రభుత్వం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రభుత్వం సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణపై తమ కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోవడంతో సంక్షోభం బయలుదేరింది. నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న కోస్తా, రాయలసీమ శాసనసభ్యులు తీవ్ర ఆగ్రహం చెందుతూ రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఇప్పటి వరకు దాదాపు 90 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారు. వీరిలో 39 మంది కాంగ్రెసు సభ్యులు, 38 మంది తెలుగుదేశం సభ్యులు, 13 మంది ప్రజారాజ్యం పార్టీ సభ్యులున్నారు. దీంతో మూడు ప్రధాన పార్టీలు కూడా రాజీనామాలతో చిక్కుల్లో పడినప్పటికీ రోశయ్య ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. 294 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 119 మంది తెలంగాణ సభ్యులున్నారు.

రోశయ్య ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో సాగుతోంది. పైగా, మెజారిటీ కాంగ్రెసు సభ్యులు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతూ రోశయ్యకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి పాలన విధించి రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందనే ఊహాగానాలు ముందుకు వచ్చాయి. వైయస్ జగన్ ప్రాబల్యాన్ని దెబ్బ తీయడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం ఇందుకు సిద్ధపడినట్లు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X