వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ను పిలిచి విభజనపై మాట్లాడ్తాం: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఢిల్లీకి అహ్వానించి ఆంధ్రప్రదేశ్ విభజనకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఒకే భాష మాట్లాడుతున్నప్పటికీ తాము విస్మరమకు గురయ్యామనే భావన వల్లనే తెలంగాణ డిమాండ్ తలెత్తిందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తామని గత రాత్రి ప్రకటన చేశామని, ఒకే భాష మాట్లాడుతున్నప్పటికీ విస్మరణకు గురయ్యామనే భావన ఉంటుందనే విషయానికి తెలంగాణ మంచి ఉదాహరణ అని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

అమెరికా జనాభా మన దేశ జనాభాలో మూడింట ఒక వంతు మాత్రమేనని, అయినా 50 రాష్టాలున్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కెసిఆర్ ఢిల్లీకి అహ్వానించి ప్రక్రియపై మాట్లాడుతామని ఆయన రాజ్యసభలో చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గత రాత్రి చేసిన ప్రకటన గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాల విభజనలో అనుభవం ఉన్న బిజెపి నేత అద్వానీ తమకు సహకరించాలని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోకసభలో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X