తెలంగాణ: టిడిపిలోనూ రాజీనామాల ప్రకంపనలు
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం నాయకుడు కెఇ కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు ఆజ్యం పోశారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు పార్టీని భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. తన నిర్ణయం ద్వారా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఇది దుర్దినమని తెలుగుదేశం శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Comments
hyderabad హైదరాబాద్ తెలుగుదేశం telangana తెలంగాణ nannapaneni rajakumari telugudesam ramakrishna రామకృష్ణ నన్నపనేని రాజకుమారి
Story first published: Thursday, December 10, 2009, 12:36 [IST]