తెలంగాణకు జై: కెసిఆర్ దీక్ష విరమణ

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం బుధవారం రాత్రి ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించనున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కాంగ్రెసు అధిష్టానం ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యులతో దశలవారీగా చర్చలు జరిపింది. కోర్ కమిటీ కూడా విడతలు విడతలుగా సమావేశమైంది. తొలుత ఎఐసిసి అధికార ప్రతినిధులు చేసిన ప్రకటనలను బట్టి తెలంగాణకు కాంగ్రెసు అధిష్టానం సుముఖంగా లేదనే అభిప్రాయం ఏర్పడుతూ వచ్చింది. కాంగ్రెసు కోర్ కమిటీ కూడా చేతులెత్తేసినట్లే కనిపించింది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులతో ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు చర్చించిన తర్వాత సమస్య కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి కె. రోశయ్యను కూడా ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపించారు. కోర్ కమిటీకి ఆయనను కూడా ఆహ్వానించారు. శాసనసభలో తీర్మానం ప్రతిపాదించడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య అంగీకరించినట్లు తెలిపారు.

చిదంబరం ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు దీక్ష విరమించారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ జయశంకర్ చేతుల మీదుగా పండ్ల రసం సేవించి ఆయన తన దీక్షను విరమించారు. ఈ విజయం ప్రజలందరి విజయమని కెసిఆర్ దీక్ష విరమంచిన వెంటనే అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ కు, ప్రతిపక్ష నేత ఎల్ కె అద్వానీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 29వ తేదీ నుంచి విద్యార్థులపై, ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేస్తున్నట్లు కూడా చిదంబరం చెప్పారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకునే లోపలే కెసిఆర్ దీక్ష విరమించారు. దీంతో రోశయ్య తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+