వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విడివిడిగా ఆంధ్ర, తెలంగాణ మంత్రుల సమావేశాలు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రుల సమావేశం కూడా కొంచెం ఆలస్యంగా మొదలైంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత తమ అడ్డాకు రావలసిందిగా తెలంగాణ మంత్రులను ఆంధ్ర మంత్రులు ఆహ్వానించారు. అందుకు తెలంగాణ మంత్రులు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఆంధ్రా మంత్రుల అడ్డాకు కాకుండా వేరే చోట ఏ స్టార్ హోటల్లోనైనా సమావేశం ఏర్పాటుచేస్తే వచ్చి ఆంధ్రా మంత్రులతో చర్చిస్తామని తెలంగాణ మంత్రులు చెప్పినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకుండా మధుయాష్కి ఢిల్లీ వెళ్ళిపోవడం చర్చనీయాంశమైంది.
Story first published: Sunday, December 13, 2009, 19:52 [IST]