తెలంగాణది అర్థరాత్రి నిర్ణయం: చంద్రబాబు నాయుడు

తెలంగాణపై నిర్ణయం విషయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యను అవమానించారని, కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీ కూడి ఏకపక్ష తెలంగాణ ప్రకటన చేశారని, కనీసం ముఖ్యమంత్రికి కూడా అసలు విషయం చెప్పలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని కూడా విశ్వాసంలోకి తీసుకోలేదని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రకటన వల్ల తమ శాసనసభ్యులపై ప్రజల ఒత్తిడి పెరిగి రాజీనామాలు చేశారని ఆయన సమర్థించుకున్నారు. శాసనసభను అర్థాంతరంగా వాయిదా వేయడం బాధాకరమని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటి వరకు పది మంది మరణించారని ఆయన చెప్పారు. సమస్యను సృష్టించింది కాంగ్రెసు పార్టీయేనని, దాన్ని కాంగ్రెసు పార్టీయే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తాము చర్చించి ఒకటి రెండు రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా సున్నితమైన అంశంపై తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. యుపిఎలోని మంత్రులతో చర్చించకుండానే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications