వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్రలోనే భవిష్యత్తు ఉంది: శైలజానాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: సమైక్యాంధ్రలోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉందని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్, కాంగ్రెసు శాసనసభ్యుడు శైలజానాథ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత ఆయన మంగళవారం మాట్లాడారు. సమైక్యాంధ్రకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రానికి మూడు ప్రాణాల్లాంటివని, మూడు ప్రాంతాలు కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతామని ఆయన చెప్పారు.

మన అభివృద్ధికి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజని, ఈ ప్రజలు పొట్టి శ్రీరాములుకు రుణపడి ఉన్నారని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రలోనే మైనారిటీలు, ఎస్సీలు, బిసిలు, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు పొట్టి శ్రీరాములు జిందాబాద్ అంటూ సమైక్యాంధ్ర జై అంటూ వారు నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X