వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లగడపాటిని నిమ్స్ కు తరలించారా?
ఎక్కడ ఉన్నా వెంటనే ఆస్పత్రిలో చేరాలని ఆమె రాజగోపాల్ కు విజ్ఞప్తి చేశారు. సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, కేంద్రం నుంచి నిర్ణయం వచ్చే వరకు సంయమనం పాటించడం అవసరమని ఆమె అన్నారు. లగడపాటి మాయమైన నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి కె. రోశయ్యతో సమావేశమై పరిస్థితిని వివరించారు. సంఘటనపై ఆమె విచారణకు ఆదేశించారు. లగడపాటి రాజగోపాల్ అదృశ్యంపై విజయవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. లగడపాటి ఈ విధంగా చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. మీడియాతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని చెప్పి రాజగోపాల్ పారిపోయారని ఆయన అన్నారు. కాగా, రాజగోపాల్ భార్య పద్మజ, ఇతర కుటుంబ సభ్యులతో మంత్రి పార్థసారథి సమావేశమయ్యారు.
Comments
Story first published: Monday, December 21, 2009, 10:31 [IST]