కెసిఆర్ దొంగ దీక్షను బయట పెట్టడానికే: లడగపాటి

తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. సీమాంధ్రలోని నాయకులు దీక్షలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రం విచ్ఛిన్నం కాకుండా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిష్కార మార్గం తన దీక్ష వల్లనో, మరొకరి దీక్షవల్లనో కాదని ఆయన అన్నారు. తాను పోలీసుల కస్టడీలో లేనని, అందువల్ల తాను విజయవాడ నుంచి హైదరాబాదుకు వచ్చినందుకు పోలీసులను సస్పెండ్ చేయడం సరి కాదని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రం పునరాలోచనలో పడిందని ఆయన అన్నారు. కేంద్రం నుంచి తమకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ మెడికల్ రిపోర్టు ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.నేడో రేపో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications