వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతి యాత్ర కోసమంటూ రోశయ్యను కలిసిన మోహన్ బాబు

By Santaram
|
Google Oneindia TeluguNews

Mohan Babu
హైదరాబాద్‌: సినీనటుడు మోహన్‌ బాబు, ఆయన కుమార్తె, కుమారులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి రోశయ్యను కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 24న టాంక్‌ బండ్‌ నుంచి సచివాలయం వరకూ శాంతి యాత్రకు అనుమతి కోరుతూ సీఎంను ఓ వినతిపత్రం సమర్పించారు.

సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ సినిమా షూటింగ్ ను తెలంగాణ వాదులు మంగళవారం అడ్డుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని పేట్ బషీర్ బాగ్ లో తెలంగాణవాదులు ఆయన సినిమా షూటింగ్ ను అడ్డుకున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించేవారి సినిమాల కుటుంబ సభ్యుల సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ ఆందోళనకారులు హెచ్చరించారు. ఆ మేరకు చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ ఆర్య 2, మోహన్ బాబు కుమారుడు విష్ణువర్ధన్ సలీం సినిమాల ప్రదర్శనను తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X