వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి నేతలపై ఓయు విద్యార్థుల దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలుగుదేశం శాసనసభ్యులపై హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు దాడి చేశారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. సంఘీభావం తెలపడానికి తెలుగుదేశం శాసనసభ్యులు నాగం జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు వచ్చారు. తెలంగాణపై టిడిపి వైఖరి స్పష్టం చేయాలంటూ వారు తెలుగుదేశం నాయకులపై దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. టిడిపి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ దాడిలో నాగం జనార్దన్ రెడ్డి స్పృహ తప్పారు.

చెప్పులతో కొడుతూ వారిని వెంటాడారు. నాగం జనార్దన్ రెడ్డిని చుట్టుముట్టి కొట్టారు. గాయాల పాలైన ఆయనను మోటార్ సైకిలుపై ఆస్పత్రికి తరలించారు. మిగతా నేతలను పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు. విద్యార్థుల దాడిలో శాసనసభ్యులకు చెందిన ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ చర్యను తెలుగుదేశం శాననసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఖండించారు. తమపై జరిగిన దుష్ప్రచారం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X