టిడిపి నేతలపై ఓయు విద్యార్థుల దాడి

చెప్పులతో కొడుతూ వారిని వెంటాడారు. నాగం జనార్దన్ రెడ్డిని చుట్టుముట్టి కొట్టారు. గాయాల పాలైన ఆయనను మోటార్ సైకిలుపై ఆస్పత్రికి తరలించారు. మిగతా నేతలను పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు. విద్యార్థుల దాడిలో శాసనసభ్యులకు చెందిన ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ చర్యను తెలుగుదేశం శాననసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఖండించారు. తమపై జరిగిన దుష్ప్రచారం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications