టిడిపి ఓటు తెలంగాణకే, దీక్ష మాత్రం చేయలేను: ఎర్రబెల్లి

ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) దీక్ష శిబిరం సందర్శించి మద్దతు ప్రకటించారు. అయితే కొందరు విద్యార్థులు ఆమరణ దీక్షలు చేయాలని వారిని కోరారు. వెంటనే సీతక్క స్పందించి ఆమరణ దీక్షను అక్కడే ప్రారంభించారు. రేపటి నుంచి ములుగులో దీక్ష కొనసాగిస్తానన్నారు. బీపీ షుగర్ ఉన్నందున ఆమరణ దీక్ష చేయలేనని దయాకర్రావు స్పష్టం చేశారు. తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మీరు ఎందుకు డిమాండ్ చేయడం లేదని దయాకర్రావును ఎస్వీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications