వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా జిల్లా నుంచి 123 హైదరాబాద్ బస్సులు రద్దు

By Santaram
|
Google Oneindia TeluguNews

APSRTC
విజయవాడ: తెలంగాణ బంద్‌కు జాయింట్‌ యాక్షన్‌ కమిటి (జేఏసీ) ఇచ్చిన పిలుపు నేపథ్యంలో, ఆ ప్రాంత జిల్లాలకు 150 బస్సులను రద్దు చేస్తూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండ, కరీమ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు రీజియన్‌ నుంచి అన్ని రకాల బస్సు సర్వీసులను రాత్రి 10 గంటల నుంచే నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌ ప్రాంతానికి కృష్ణా జిల్లా నుంచి 123 బస్సులు నడుస్తున్నాయి. వీటన్నింటిని అధికారులు నిలిపి వేశారు. ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు 20 బస్సులు నడుస్తున్నాయి. వీటిని కూడా ముందు జాగ్రత్తగా రద్దు చేస్తున్నారు.తెలంగాణా బంద్‌ పిలుపు రాష్ట్రంలో కృష్ణా రీజియన్‌పైనే తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లా నుంచే తెలంగాణా జిల్లాలకు ఎక్కువ బస్సు లు నడుస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల కృష్ణా రీజియన్‌కు 18 లక్షల రూపాయల నష్టం వాటిల్లనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X