తెలంగాణపై 5న పార్టీలతో కేంద్రం చర్చలు

కాంగ్రెసు, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం, బిజెపి, మజ్లీస్ పార్టీలను కేంద్రం అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించింది. తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగినందుకు హోం శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణపై నిర్దిష్టమైన చర్యకు ఈ సమావేశం ఉపయోగపడగలదని భావిస్తున్నారు. కాగా, తాజా పరిణామంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సమావేశమవుతోంది.












Click it and Unblock the Notifications