వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంతి ఉద్యమాలకు డిజిపి అభినందనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Girish Kumar
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుండడాన్ని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ అభినందించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభినందించారు. రాష్ట్రంలో ఈ ఏడాది నిరుటి కన్నా నేరాలు గణనీయంగా తగ్గాయని ఆయన చెప్పారు. బంద్ సందర్బంగా జరుగుతున్న హింసాత్మక చర్యల వల్ల సామాన్య ప్రజలు, వాణిజ్యవేత్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

వచ్చే ఏడాది మరో మూడు ఎపిఎస్పీ బెటాలియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హింసను ప్రోత్సహిస్తే మీడియాపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. నక్సలైట్ల సమాచారం ఉన్నందున రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలిచారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X