వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ లో జెఎసి నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mandha Krishna Madiga
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) నాయకులు, కార్యకర్తలు బుధవారం ర్యాలీ తలపెట్టారు. తెలంగాణ బంద్ సందర్భంగా జెఎసి నాయకులు హైదరాబాదులోని సుందర విజ్ఞాన సంస్థ నుంచి ర్యాలీ తీయడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంత మందికి గాయలయ్యాయి. ఈ సందర్భంగా జెఎసి నాయకులను పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించి నిర్బంధించారు.

జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదం రామ్ తో పాటు తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, టి. దేవేందర్ గౌడ్, ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమతి నాయకులతో పాటు పలువు ప్రజా సంఘాల నాయకులు అరెస్టయినవారిలో ఉన్నారు. తెలంగాణ బంద్ ను ప్రశాంతంగా నిర్వహించాలని జెఎసి కన్వీనర్ కోదండరామ్ ప్రజలను కోరారు. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ పై ఒత్తిడి తేనున్నట్లు మందకృష్ణ మాదిగ చెప్పారు. రాజకీయ నాయకులు రాజీనామాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యక్ష ఆందోళనలోకి రావాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X