వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవసరమైతే మరోసారి నేను చస్తా: కె చంద్రశేఖర రావు
కాళ్లు మొక్కినా విద్యార్థులు దీక్ష విరమించడానికి సిద్ధపడడం లేదని, ఉస్మానియా జెఎసి జోక్యం చేసుకుని విద్యార్థులతో దీక్షలు విరమింపజేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల శిబిరాలు తొలగిస్తూ, పోలీసులు దౌర్జన్యాలకు దిగుతుంటే శాంతి ఎలా ఏర్పడుతుందని, టీవీల ద్వారా ముఖ్యమంత్రి కె. రోశయ్య శాంతి మంత్రం వల్లిస్తే సరిపోదని ఆయన అన్నారు. ఆస్పత్రుల్లో చేర్చిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మంత్రులను, ఉన్నతాధికారులను పంపి వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంతటా బుధవారం శాంతియుతంగా బంద్ పాటించారని ఆయన చెప్పారు. ఒక్క ప్రాణం పోయినా తెలంగాణ భగ్గుమంటుందని ఆయన హెచ్చరించారు.
Comments
Story first published: Wednesday, December 30, 2009, 17:12 [IST]