కర్నూలు ప్రజారాజ్యం ఆఫీసు ఖాళీ!

అయితే మూడు నెలల క్రితం అంత బాడుగను భరించలేము, 10నుంచి 12వేల రూపాయల్లో బాడుగ ఉండే విధంగా కార్యాలయాన్ని చూడాలని రాష్ట్ర పార్టీ ముఖ్యులు జిల్లా నేతలకు తెలియజెప్పినట్లు తెలిసింది. తరుచూ ఆఫీసులు ఎందుకు మార్చాలనే భావనతో మిగతా మొత్తాన్ని పార్టీ జిల్లా నేతలు భరించుకునే విధంగా నిర్ణయించుకున్నారు. అయితే గత మూడు నెలల కాలంలో అద్దెల కోసం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి చిల్లి గవ్వ కూడా అందలేదని సమాచారం.
జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి పీఆర్పీ తరఫున ఎన్నికయ్యారు. పలు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. పీఆర్పీ జిల్లా కన్వీనర్ భూమానాగిరెడ్డి తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు నడిపించేందుకు ఎన్నికల సమయంలో ప్రయత్నించారు. ఆ పార్టీ రాష్ట్ర ఆధ్యక్షుడు, సినీ నటుడు చిరంజీవి జిల్లా పర్యటన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడంలో భూమా, ఆయన మద్దతుదారులు కీలకంగా వ్యవహరించారు.
అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఇటు చిరంజీవి, అటు భూమా ఆశలు నెరవేరలేదు. దీంతో భూమా, ఆయన మద్దతుదారులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. వారికి కాంగ్రెస్ గాలం వేస్తుండగా, వారు కూడా అధికార పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నారు. ఈ పరిస్థితిలో పీఆర్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు చిరంజీవి ఇతర ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడటంతో జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలపై శ్రద్ధ చూపలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications